JNI Today పుణె: సొంతగడ్డపై తమకు ఎదురులేదని టీమ్ఇండియా మరోసారి నిరూపించింది. గత రెండేళ్లుగా స్వదేశంలో పర్యటించిన ఏ అగ్రశ్రేణి జట్టు కూడా భారత్కు కనీస పోటీ ఇవ్వలేదు. తాజాగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భారత్ వరుసగా రెండింట్లో గెలుపొంది సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇంకో టెస్టు మిగిలుండగానే సిరీస్ను చేజిక్కించుకోవడం విశేషం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కోహ్లీసేన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. పుణె టెస్టులో ఆల్రౌండ్ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీసేన సఫారీలపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ ప్రత్యర్థికి కొండత లక్ష్యాన్ని నిర్దేశించగా.. సౌతాఫ్రికాను రెండు సార్లు బౌలర్లు కుప్పకూల్చి భారత్కు గొప్ప విజయాన్నందించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును డబుల్ సెంచరీ హీరో విరాట్ కోహ్లీ(254) అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 326 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్ ఫాలోఆన్ ఆడించింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో డీన్ ఎల్గర్(48), బావుమా(38), ఫిలాండర్(37), కేశవ్ మహరాజ్(22) మినహా మిగతా బ్యాట్స్మెన్ కేవలం సింగిల్ పరుగుకే పరిమితమయ్యారు. పిచ్ స్పందిస్తున్న తీరును అర్థం చేసుకొని ఆడటంలో సఫారీలు విఫలమయ్యారు. మరోవైపు పేస్, స్పిన్తో భారత బౌలర్లు విరుచుకుపడటంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఉమేశ్ యాదవ్(3), రవీంద్ర జడేజా(3), అశ్విన్(2) ప్రొటీస్ను కుప్పకూల్చారు. బౌలర్ల మెరుపు బంతులకు 67.2 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్: భారత్- 601/5 డిక్లేర్డ్ దక్షిణాఫ్రికా- 275 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: సౌతాఫ్రికా- 189 ఆలౌట్(67.2)